Home Blog Page 7

టైం బాంబ్……

unnamedఇండియా టైం బాంబు మీద కూర్చుని వుంది.ఈ మాట చెప్పింది ఎవరో కాదు, సుప్రీమ్ కోర్ట్ ఆఫ్ ఇండియా…ఆ టైం బాంబు పేరు ప్లాస్టిక్.నిజం..ఈ ప్లాస్టిక్ చెత్త వల్ల కలిగే నష్టాలు న్యూక్లియర్ ఆయుధాల కన్నాఎక్కువని చెప్తున్నారు  సెంట్రల్ బోర్డ్ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్  వాళ్ళు.

ప్లాస్టిక్ లేని మన జీవితం ఈ రోజుల్లో వూహించడం చాలా కష్టం.మనం వాడే సెల్ ఫోన్ల దగ్గర నుంచి,వంటింట్లో వెజిటబుల్ బోర్డు వరకు అన్నిప్లాస్టిక్ తో తయారు చెయ్యబడినవే.వీటివల్ల వల్ల కాదు సమస్య.అసలు సమస్య మొత్తం వాడేసిన ప్లాస్టిక్ ని ఎలా డిస్పోస్ (dispose)చెయ్యాలనేదే.ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్ల వినియోగం మరీ ఎక్కువైపోతున్న ఈ రోజుల్లోవాటిని ఎలా డిస్పోస్ చెయ్యాలనేది  పెద్ద ప్రశ్న.

nmfమీకు తెలుసా మన దేశంలో  ప్రతి ఏటా 56 లక్షల  టన్నుల ప్లాస్టిక్ చెత్త విడుదల అవుతోంది.ఇందులో 60% మాత్రమే రీసైకిల్ చెయ్యబడుతోంది.మిగతాదంతా అలాగే ఉండిపోతోంది.ఏటేటా ఇది ఇలాగే పేరుకుంటూవస్తోంది.దీని వల్ల మనం ఊహించలేని విధంగా పర్యావరణం దెబ్బ తింటోంది.

మనకి షాపుల్లో ఇచ్చే ప్లాస్టిక్ సంచుల మందం 40 మైక్రాన్ల కన్నాతక్కువ ఉండకూడదు.కాని మన దేశం లో అన్ని దుకాణాల్లో ముఖ్యంగా కూరగాయలు,పండ్ల దుకాణాల్లో ఇచ్చే కవర్లు మరీ20 మైక్రాన్ల మందం మాత్రమే ఉంటున్నాయి.ఇవి చాలా ప్రమాదకరం.వీటి వల్ల కాన్సర్ కూడా రావచ్చుఅని తెలుస్తోంది.

చట్ట ప్రకారం 40 మైక్రాన్ల కన్నాతక్కువ మందం కల ప్లాస్టిక్ బ్యాగులు అమ్మితే ఒక నెల జైలు శిక్ష తో పాటు జరిమానా కూడా కట్టాలని కోర్టు చెప్తోంది.ఐనా కూడా ఈ కవర్ల వాడకం ఇంకా పెరుగుతూనే ఉంటోంది.వీటివల్ల నష్టాలు ఇప్పుడు తెలీకపోయినా రానున్న కాలంలో చాలా తీవ్ర సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.అవి ఏంటంటేmkdg

1.ఈ కవర్లు భూమిలోఎట్టి పరిస్తుతుల్లో కలసిపోవు.వర్షం నీరు భూమి లోకి వెళ్ళకుండా చేసి..భూగర్భజలాలను తగ్గించేస్తాయ్.ఈ సమస్య ఇప్పటికే ఎక్కువగా వుంది మనకి.దీని వల్ల వర్షాలు కూడా సరిగ్గా పడవు.

2.ఆవులు వీటిని తినడం వల్ల అవి పాలు ఇతర పాల పదార్ధాల రూపం లో మనకి చేరుకుంటాయి.పాలల్లో ప్లాస్టిక్ అవశేషాలని ఇటీవల కనుకున్నారు కూడా.

౩.సముద్రాలలో , నీటి చెరువుల్లో వీటిని పారెయ్యడం వల్ల సముద్ర జీవులు ఎన్నో చనిపోతున్నాయ్.వీటివల్ల పర్యావరణ సమతుల్యత(ecological balance)ఘోరంగా దెబ్బతింటోంది.ప్లాస్టిక్ వేస్ట్ వల్ల 267 సముద్ర జీవులు కనుమరుగైపోయాయని(extinct) ఈ మద్య ఒక నివేదికలో తెలిపారు.BL20_ACC_GREEN4_1182137f

4.వీటిని కాల్చడం వల్ల విషవాయువులు మనం పీల్చే గాలిలోకి విడుదల అవుతాయి.అవి కాన్సర్ కి కూడా దారి తీయవచ్చు.

1609986_10201317888849094_690009768_n

 

“ఇది ఇలాగే కొనసాగితే కొన్ని సంవత్సరాలకు ప్లాస్టిక్ పొరల కింద బయటపడ్డ ఒక కొత్త గ్రహం అని వేరే గ్రహాల వాళ్ళు వార్తలురాసుకోవలసి వస్తుందేమో.”

 ఇన్ని దరిద్రపు లక్షణాలు వున్న ఈ ప్లాస్టిక్ కవర్లని వాడడం        అవసరమా????.తప్పదు అన్న పరిస్థితుల్లో తప్పించి మిగతా పనులకి వీటి వాడకం తగ్గించడం మంచిది.రానున్న ప్రమాదాల్ని గమనించి వీటి ఉపయోగం కాస్త తగ్గించండి..గుడికి వెళ్ళేటప్పుడు, కూరగాయలకివెళ్ళేటప్పుడు మీ బాగ్ మీరే తీసుకెళ్ళండి..మిమ్మల్ని చూసి ఇంకొందరు మొదలు పెడతారు…ఎక్కడ పడితే అక్కడ పారెయ్యకుండా రీసైకిల్ చేసే వారికి ఇస్తే కొంత సమస్య తీరుతుంది.అంతా మన చేతుల్లోనే వుందండి…కాస్త….నేను , నా, అనేది వదిలి… మనం , మనది  అనే భావన పెంచుకుందాం..చీపు గా వస్తున్నాయని కొనేస్తే..తర్వాత భారీగా సమర్పించుకోవాలి హాస్పిటల్ వాళ్ళకి.

మన అసెంబ్లీ లో ప్లాస్టిక్ చెత్త:

హైదరబాద్ మున్సిపాలిటీ పరిధి లో రోజు రోజుకీ ఈ ప్లాస్టిక్ చెత్త ఎక్కువై పోతోందట.అసెంబ్లీ లో కూడా ఈ విషయం చర్చకు                          వచ్చిందంటే…చూడండి..విషయం ఎంత సీరియస్సో…28TH_SANGAM_DIRT_1441979f

పూణే ప్రభుత్వం వారు జపాన్ కి చెందిన ఒక సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ ప్లాస్టిక్ చెత్త నుండి డీజిల్ ఉత్పత్తి చేసే మిషన్లు ఏర్పాటుచేస్కున్నారు.దీనికి మొత్తం పెట్టుబడి 5 కోట్లు మాత్రమే.జపాన్ సంస్థకూడామన రాష్ట్రం లో ఈమిషన్లని ప్రవేశపెట్టడానికి ముందుకి వచ్చింది.అందుకు ఫండ్సు మంజూరు చెయ్యమని అసెంబ్లీలో ఎప్పుడో చెప్పారట ..కాని ఆ బిల్లు పట్టించుకునే ఓపిక ,తీరిక ఎవరికీ లేకపోయింది..

“అవున్లే ఈ నేల నాది…ఆ ఊరు మాది అని కొట్టుకుని చావడానికే సరిపోతోంది మన వాళ్ళకి…ఈ విధంగా వుంటే ఎదో ఒక రోజు  ఏ నేల కోసం కొట్టుకుంటున్నామో ఆ నేల ఎందుకూ పనికిరాకుండాపోతుంది.”

కాబట్టి మనమైనా మన వరకు మనం ఈ చెత్త ని తగ్గించే ప్రయత్నం చేద్దాం.మన నుండి ఏమీ ఆశించకుండా మనకన్నీఇచ్చే ఈ ప్రకృతికి ఈ మాత్రం మనవంతు  గా కృషి చెయ్యడం గొప్పేం కాదు…ఏమంటారు?

(ఈ సమస్య కి పరిష్కారం మీరు కూడా తెలపవచ్చు…)mkgf

మహాశివరాత్రి

5505643_origమాఘ మాసం లో (కృష్ణ పక్షం)14వ రోజు శివునికి ఎంతో ప్రీతీ దాయకమైనది.ఈ రోజునే మహా శివరాత్రి పేరున శివున్ని పూజించడం ఆనవాయితీగా వస్తోంది.శివ రాత్రి పండుగ వెనుక ఎన్నో పురాణ గాధలు వున్నాయని ప్రతీతి.ఈ రోజే ఈశ్వరుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించాడని,క్షీరసాగర మథనం జరిగింది అని, పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని,గంగ దివి నుండి భువికి వచ్చింది ఈ రోజే అని చాలా విశేషంగా చెప్పుకుంటారు.

శివ అంటే శుభం అని అర్ధం.లోకాలన్నిటికి శుభం కలిగించేవాడు శివుడు.శివుడు భోళా శంకరుడు.అడిగిన వెంటనే లేదనక వరాలు ఇచ్చే దేవుడు.ఈ అనంత సృష్టి కి లయకారకుడు,ఆదిగురువు.యోగ విద్య, నాట్య వేదం అన్ని అయన నుండి పుట్టినవే.పార్వతికి అర్ధ శరీరం ఇచ్చి స్త్రీ పురుషులు సమానమని చాటి చెప్పిన వాడు.

శివ రూపం విజ్ఞానానికి,మనో తేజస్సుకు ప్రతీక.అయన విశ్వమంతా వ్యాపించి వున్నాడు.అదే శివ తత్వం.

అటువంటి శివునికి ఎంతో ఇష్టమైన శివరాత్రి గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం..

లింగోద్భవం:ఒక నాడు బ్రహ్మ, విష్ణువులకి తమలో ఎవరు గొప్ప అనే విషయం పై వాదనవచ్చింది.ఆ విషయం శివున్ని అడుగగా,మహా శివుడు జ్యోతిర్లింగంగా అవతరించి నా ఆది ,అంతం ఎవరు కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్తాడు .జ్యోతిర్లింగానికి ఆది, అంతం ఉండదు.శివుడు విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడని జ్యోతిర్లింగం సూచిస్తోంది.చివరికి విష్ణు, బ్రహ్మ లు శివలింగం యొక్క ఆది, అంతాలు కనుక్కోలేక తమ అహంకారాలని పక్కనపెడతారు.శివుడు జ్యోతిర్లింగంగా ఉద్భవించిన రోజు కనుక ఈ రోజు ని మహా శివరాత్రి గా జరుపుకుంటారు.

samudra-manthan-CU09_lక్షీరసాగర మధనం:అమృతం కోసం , అమరత్వం కోసం దేవతలు , రాక్షసులు పాల సముద్రాన్ని చిలకాలని నిశ్చయించుకున్నారు.మేరు పర్వతాన్ని కవ్వంగా చేసి, వాసుకి ని తాడు లా చేసి పాలసంద్రాన్ని మధించగా, అందులో నుండి ఎన్నో విలువైనవి వచ్చాయంట.తరువాత అత్యంత ప్రమాదకరమైన హలాహల విషం పుట్టుకొచ్చింది.దాని వలన ప్రపంచం అంతమైపోతుంది.దాన్ని భరించే శక్తి ఒక్క శివునికే వున్నదని, దేవతలంతా శివున్ని కోరగా, అయన ఆ విషాన్ని తాగుతాడు.అది కడుపులో కి చేరితే ప్రమాదమని, పార్వతి దేవి తన చేతిని శివుని గొంతుకి అడ్డుపెట్టిందట.అప్పుడా విషం అక్కడే నిలచిపోయి శివుని కంఠం నీలం గా మారిపోయింది.అందుకే శివునికి నీలకంటుడని మరో పేరు.ఆ విష ప్రభావం నుండి శాంతి పొందాలంటే శివున్ని ఆ రాత్రి మొత్తం నిదురించరాదని వైద్యులు సూచించారు.అందుకని దేవతలంతా ఆ రోజు రాత్రి శివుని కోసం జాగరణ వుండి తమ భక్తి ని చాటుకున్నారట.మరుసటి దినం శివునికి ఆ విషం యొక్క ప్రభావం నుండి విముక్తి లభించింది.అందరి శ్రేయస్సు కోరి విషాన్ని మింగిన శివుని  కోసం ఎటేటా శివరాత్రి నాడు మనం జాగరణ ఉండి అయన పట్ల మనకున్న భక్తిని చాటుకుంటున్నాం.

శివతాండవం: శివుడు తాండవ నృత్యం చేసిన రోజు కూడాఈ రోజే అని చెప్తారు.శివ తాండవం సృష్టి లో చావు_పుట్టుకలకి ,సృష్టి కి_వినాశనానికి ప్రతీకఅని చెప్తారు.

శివ పూజ:శివుడు  అభిషేక ప్రియుడు.పంచామృతాలతో శివాభిషేకం చేస్తే ఎంతో మంచిది.బిల్వ ఆకులు కూడా శివునికి ఎంతో ఇష్టం.ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం ఈరోజంతా మనసులో అనుకుంటే చాలా మంచింది.శివ ధ్యానంలో ఈరోజంతా ప్రశాంతంగా గడపాలి.మనసు , శరీరం దైవం మీద లగ్నం చేసి,చెడు ఆలోచనలకు, పనులకూ దూరం గా వుంటే అదే మీరు చెయ్యగలిగిన విశిష్టమైన శివ పూజ.అంతేకాని శివునికి అభిషేకం చేసి పాపాలన్నీపోయాయని మళ్ళి కొత్తగా పాపాలను మొదలుపెట్టకండి.shiva-linga

ఉపవాసం: శివునికై ఈ రోజు చాలామంది ఉపవాసం ఉంటారు. వైజ్ఞానికంగా కూడా ఉపవాస దీక్ష ఎన్నో మంచి ఫలితాలని ఇస్తుందని నిరూపిన్చబడినది. అప్పుడప్పుడూ ఉపవాసం చెయ్యడం వల్ల మన శరీరంలో వుండే చెడు కొలెస్ట్రాల్ తగ్గి, శరీరానికి ముఖ్యంగా ,లివరుకి మన శరీరంలో చెడు పదార్ధాలను తొలగించడానికి కొంత సమయం చిక్కుతుంది.అందుకే మన పెద్దలు ఉపవాస దీక్ష పెట్టారు.కాకపోతే షుగరు, బి.పి వంటి ఆరోగ్య సమస్యలు వున్న వారు మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి.

సైంటిఫిక్ రీజనింగ్:మన పూర్వీకులు ఏది చేసినా ఒక పరమార్ధం వుంటుంది.శివరాత్రి ప్రతి ఏటా మాఘ మాసం లో 14రోజు వస్తుంది.ఈ రోజు గ్రహాల కదలిక అంటే planetary movement  వల్ల మానవ శరీరంలో శక్తి ప్రసరిస్తుందట, అందుకని మానవులని మేల్కొల్పి ఆ శక్తిని  గ్రహించేందుకు వీలుగా జాగరణని ఏర్పాటు చేసారని తెలుస్తోంది.

కాబట్టి ఈసారి శివరాత్రి కి అందరితోపాటూ నేనూ, అని కాకుండా….ఈ రోజు యొక్క ప్రత్యేకతని తెలుసుకుని జరుపుకుందాం.ఆధ్యాత్మికంగానూ,వైజ్ఞానికంగాను శివరాత్రి పూజ,ఉపవాసం ఇంకా జాగరణ ఎంత మేలో తెలిసింది కదా.ఏ కారణం లేకుండా మన పెద్దలు పండుగలను జరపరని మరొక్కసారి తెలిసింది.

అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు….

shiva

తేనెల మూట..తెలుగు మాట.

njuఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, అంతా కొత్తే…..భాష రాదు , మన ప్రాంతం కాదు . అప్పుడు ఎక్కడినుంచో ఒక తెలుగు మాట వినిపిస్తే మన కెంత సంతోషంగా వుంటుంది..ఎడారిలో ఒయాసిస్సు చూసినట్టు వుండదూ? అదే నండి ఒక భాష గొప్పతనం..మాతృ భాష అంటే మన ఉనికి, మన వ్యక్తిత్వం.ఫెబ్రవరి 21 ప్రపంచ మాతృభాషా దినోత్సవంగా యునెస్కో వారు గుర్తించారు.అందుకని ఈ రోజు ఒకసారి మన తేనెల తేటల తెలుగు బాష గురించి చూద్దాం.

“దేశ భాషలందు తెలుగు లెస్స” అన్నారు మన పెద్దలు.”ఇటాలియన్ ఆఫ్ థ ఈస్ట్” అని పాశ్చ్యాత్యులు అన్నారు , ఎందుకంటే ఇటాలియన్ భాష తర్వాత ఎక్కువ అచ్చులు వున్న భాష మనదే అట.అంత గొప్పది కాబట్టే విదేశీయుడైన సి.పి.బ్రౌన్ దొర, తెలుగు భాష ని నేర్చుకోవడమే కాకుండా తెలుగు భాష లో నిఘంటువు కూడా రాసారు.

మన మనసులో భావాలను వ్యక్తం చెయ్యాలంటే మన మాతృ భాషను మించినది వేరే భాష లేదంటాను.అవునా?నవరసాలలోని అనుభూతిని మనకి తెలియజేసింది మన తెలుగు భాషనే కదా?అడగనిదే అమ్మైనా పెట్టదు అంటారు కదా? అటువంటి అమ్మను ఏదైనా అడగాలన్నా కూడా మనకు మన భాషే కావాలి.అటువంటి మాతృ భాష మీద మనం గౌరవం కలిగి వుండడం మన ధర్మం.

మన పిల్లలకు మనం మన సంస్కృతి , సాంప్రదాయాలు తెలియజేయాలంటే ముందుగా మాతృ భాష మీద వారికి అభిమానం ఏర్పడేటట్టు చెయ్యాలి. పిల్లలకి నైతిక విలువలు, నీతి సూక్తులు చెప్పాలంటే మన భాష లో ఎన్ని పద్యాలు ఉన్నాయో చెప్పక్కరలేదు..జీవిత సత్యాలను చిన్న చిన్న పద్యాలలో పిల్లలకు తెలియజేసే శతకాలు ఎన్నో వున్నాయి తెలుగు లో..ఎదో భట్టీయం వెయ్యడం కాకుండా వాటిని పిల్లలకు అర్ధం అయేట్లు చెప్తే వారి మానసిక అభివృద్దికి అది ఎంతో మేలు చేస్తుంది..మొక్కై వంగనిది మానై వంగునా? అన్నారు పెద్దలు..కాబట్టి చిన్ననాటి నుండే వారికి మన భాష లోని గొప్పతనం తెలియచెయ్యాలి.మాతృ భాష లో పట్టు ఉన్న వారికి సృజనాత్మక శక్తి ఎక్కువగా వున్నట్టు నిరూపిన్చబడినది కూడా.Yashoda_Krishna mother

మనకే ప్రత్యేక మైనటువంటి పద్యాలూ, పాటలు, సామెతలు , కధలు మన ముందు తరాల వారికి అందచెయ్యవలసిన భాద్యత మనపై ఎంతైనా వుంది.

చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా?” అంటూ మీ చిన్నారి పాప పాడితే మీకెంత సంతోషంగా వుంటుంది చెప్పండి.

అనగనగా కధలు మనకి పాతే కావచ్చు, కాని మన పిల్లలకి అవి కొత్తే కదా?పెద్దలకి పిల్లల మధ్య అనుభంధాలు, ఆప్యాయతలు పెనవేసుకోడానికి మాతృ భాష ఎంతో అవసరం….పెద్దలపై వీడని పాశాన్ని కలిగించే శక్తి ఒక్క మాతృ బాష కే వుంది .

చేతి వెన్న ముద్ద చెంగల్వ పూదండ..”అని చెప్పించిన తాతయ్యని ఎవరు మరచిపోతారు?

అనగనగా ఒక రాజు , ఆయనకి ఏడుగురు కొడుకులు , వాళ్ళు వేటకెళ్ళారు“…అని పడుకునేటప్పుడు చెప్పే బామ్మని మరచిపోగలమా?

ఆకేసి , పప్పేసి, నెయ్యేసి…అమ్మకో ముద్దా,నాన్నకో ముద్దా, నీకో ముద్దా“..అంటూ గోరు ముద్దలు తినిపించే అమ్మ ప్రేమని ,మనకందించిన మన మాతృ భాషకి ఎలా కృతజ్ఞతలు చెప్పుకోగలం?

నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు

తళుకు బెళుకు రాళ్ళు తట్టేడేలా?

చదువ పద్య మరయ చాలదా ఒక్కటి?

విశ్వధాభిరామ  , వినుర వేమా” ఇంత గొప్ప సదేశం ఎన్ని మానెజ్మెంటు క్లాస్సుల్లో చెప్పాలి? ఒక్క పద్యం లో జీవితానికి సరిపోను పాఠం నేర్చేసుకోవచ్చు కదూ?అందుకే అమృతతుల్యమైన మన భాష ను కాపాడి మన ముందు తరాలకు ఇవ్వవలసిన భాధ్యతని మనం తీస్కుందాం…..

ఆధునిక కాలంలో రాణించడానికి కావలసిన ఆంగ్ల భాషను నేర్చుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మన భాష ను మరువకూడదు.ఎందుకంటే మన భాష మన ఉనికి..మాతృ భాషని ప్రేమించలేనివాడూ, రానివాడూ ఆత్మ లేని శరీరం లాంటి వాడు.

ప్రపంచ మాతృ భాషా దినోత్సవ సందర్భంగా ఒక్క సారి మన తెలుగు తల్లికి మల్లెపూదండని వేద్దామా?

   index

తెలుగువాడి ఆత్మగౌరవం..

2pu0mqwరాష్ట్ర విభజన సెగలు రాష్ట్రాన్నివేడేక్కిస్తున్నాయ్.నిజంగా తెలుగు జాతి ఆత్మగౌరవానికి ఇది సవాల్ ..రాష్ట్రం విడిపోతోంది అంటే ఏంతో బాధ గా వుంది.ఎంతో కష్టపడి  కట్టుకున్న పొదరిల్లు ని పిల్లలు రెండు భాగాలూ చెయ్యబోతున్నారు…ఇందులో ఎవరికి లాభమో ఎవరికి నష్టమో తెలీదు కాని తల్లి కి మాత్రం కడుపు కోతే మిగులుతుంది.

1953  శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మాహుతి తో మద్రాస్ సంయుక్త రాష్ట్రం నుండి విడివడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయింది.తరువాత 1956లో తెలంగాణా ప్రాంతం నిజాం పాలన నుండి విడివడి ఆంధ్రరాష్ట్రం తో కలిసి, తెలుగు మాట్లాడే జాతి గా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ జరిగింది.

ఇన్నాళ్లకు మళ్ళి రాష్ట్రం విడిపోతోంది…ఈ విషయం శోచనీయం.స్వార్ధ రాజకీయాలకు మళ్ళి ప్రజానీకం బలి కాబోతోందా?

“ఏ జాతి చరిత చూసినా ఏమున్నది గర్వ కారణం

నరజాతి చరిత సమస్తం పరపిడన పరాయణత్వం”అన్న శ్రీ శ్రీ మాటలు మళ్ళి నిజం కాబోతున్నాయా???

సరే హక్కుల గురించి , ఆస్తుల గురించి, ఉద్యోగాల గురించి వనరుల గురించి ఒక ప్రాంతం వారికి న్యాయం చేకుర్చాలంటే  విడిపోయ్యే చెయ్యాలా? కలిసి వుండి కూడా ఈ సమస్యలను పరిష్కరించుకోవచ్చు కదా?విడివడి సాధించేదేముంది?

కేంద్రం కూడా ఆమోదముద్ర తెలియజేస్తోంది.అయితే ఇరు పక్షాల వాదనలు వినాలి కదా?విభజించాక వచ్చే సమస్యల గురించి ఆలోచించారా అసలు.

ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్ర రాజధాని ఏర్పడడానికి జీవితకాలం పడుతుంది.అందుకు ఎంత భారం ఖజానా పై పడుతుంది.?ఈ భారమంతా మళ్ళి ప్రలపైనే కదా పడేది?ఇప్పుడు నిర్మాణం లో వున్న ప్రాజక్టుల గతేంటి? అసలు వీటి గురించి ఆలోచించకుండా ఎలా ప్రతిపాదించారు బిల్లు ని?

ఒకసారి ఆలోచిస్తే,  చిన్న చిన్న ఆశలను ఎరగా వేసి, అమాయక ప్రజల వ్యక్తిత్వాలతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తోంది. దుష్ట రాజకీయ కుట్రలకి ఇంకో జాతి విచ్చిన్నం కాబోతోంది.

ఒకసారి మూర్ఖత్వాన్ని పక్కనబెట్టి ఆలోచిస్తే ..చివరగా మోసపోయేది ఎవరో?..లాభపడేది ఎవరో తెలిసిపోతుంది?

తెలుగుతనానికి ఇన్ని రోజులు చిహ్నాలుగా వున్న అన్ని ప్రదేశాలు,గుళ్ళు ,గోపురాలు,కళలు,సాంప్రదాయాలు ,మనకే ప్రత్యేకమైనటువంటి రుచులు అన్ని కూడా మూగగా రోదిస్తున్నాయి…ఒకసారి వినండి.index

చరిత్ర లో ఎన్నో గొప్ప రాజ్యాలు వచ్చాయ్ ..కాలగర్భం లో  అన్ని కలిసిపోయాయి.రాజ్యాలు,రాజ్యాంగాలు ఎన్ని వచ్చినా కూడా ప్రజలకి ఒరిగినది  ఏంటి?..

ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవడం గొప్ప కాదు.సరైన పాలనా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవడం గొప్ప.మార్పు తీస్కురావలసింది మన రాజ్యాంగ వ్యవస్థలో.విడివడ్డా కూడా  రాష్ట్ర భవిష్యత్తు అనేది పాలకుల చేతిలోఉంది అన్న విషయం మరువ వద్దు.సరైన పాలకులు  లేనప్పుడు న్యాయం అనేది సామాన్య మానవుడికి చేరుతుందా అనేది ప్రశ? ఒక్కసారి ఆత్మవిమర్శ చేస్కోండి?

చిన్న చేపను పెద్ద చేప మింగుట లోక రీతి కదా?

హై హై నాయకా…

mnkసోనియా గాంధీ తన రాజకీయ వారసుడు రాహుల్ గాంధీని ప్రజలకి దగ్గర చెయ్యాలనుకునే ప్రయత్నాలన్నీబెడిసికొడుతున్నట్టు ఉన్నాయ్.కాంగ్రెస్ యువరాజు తన చేతులారా తనే తన స్థానాన్ని ఇరకాటం లో పెట్టుకుంటున్నాడు.ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే యువరాజా వారి అయోమయ పరిస్థితి చాలా స్పష్టంగా అర్ధమవుతుంది.

10 ఏళ్ల రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ ఇచ్చిన తొలి ప్రత్యక్ష ఇంటర్వ్యూ ఇది. అందులో రాహుల్ ప్రవర్తించిన తీరు చూస్తే పదేళ్ళ రాజకీయ అనుభవం వున్న నాయకుడి లక్షణాలు అస్సలు కనిపించవు.ఎదో బలవంతంగా తన కిష్టం లేని పని ఎదో చేస్తున్నట్టు ఇబ్బంది పడిపోయాడు.దేశాన్ని నడుపుతున్నటువంటి ఒక పార్టీ అభ్యర్దికి ఉండవలసిన కనీస లక్షణాలు మచ్చుక్కైనా కనిపించలేదు.ఇక నాయకత్వ లక్షణాల గురించి ఆశపడడం, గగన కుసుమం అవుతుందేమో.తను రాజకీయాల్లో ఇమడలేడు అన్న విషయం పక్కాగా తేటతెల్లం అయిపోఇంది.

1.30గంట పాటు జరిగిన ఇంటర్వ్యూ లో , సదరు జర్నలిస్టు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి కూడా రాహుల్ సూటిగా సమాధానం చెప్పలేదు సరికదా, అసలు ప్రశ్న కి సమాధానానికి కనీసం వెంట్రుకవాసంత సంబంధం కూడా లేదు.ఒక పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఆ విధంగా సమాధానం చెప్పడాన్ని ప్రజలు అస్సలు జీర్ణించుకోలేక పోయారు.RahulGandhi

అసలు ఏప్రశ్న అడిగినా కూడా తనకు తెలిసిన సమాధానమే చెప్పాడు, ఎదో భట్టీయం వేస్కోచినట్లు.మచ్చుక్కిఒకటి చూడండి…

1ప్రశ్న:”.గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోడీ హస్తం లేదని కోర్టు తీర్పు ఇచ్చింది కదా మరి మీరు మోడీ ని ఎందుకు అపరాధి అని చెప్పారు”,అని అడిగిన ప్రశ్న కు మన యువరాజా ఎం చెప్పారంటే…

రాహుల్:”దేశం చాలా ఇబ్బంది కర పరిస్థితుల్లో ఉంది, ఈ వ్యవస్థనిమార్చాలి, స్త్రీలకి రాజకీయాల్లోప్రాముక్యతని పెంచాలి యువతని రాజకీయాల్లో తీస్కుని రావాలి ” అని చెప్పాడు…నాకైతే ఒక నిమిషం నేనేం విన్నానో అర్ధం కాలేదు

పాపం ఇంటర్వ్యూ చేసిన ఆయన కూడా , “అది కరెక్టే గాంధీ గారు అలాగే చేద్దురు గాని ముందు మోడీ గురించి మీ అభిప్రాయం చెప్పండి“, అని మళ్ళి అడిగాడు

దీనికి జూ.గాంధీ గారు, “దేశం లో పారిశ్రామిక అభివృద్ది ని పెంచాలి, డెమోక్రసీని మూల మూలాల్లోకి వ్యాపించాలి”, అన్నారు

అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్ళి అదే ప్రశ్న ని వేరే విధంగా అడిగాడు  ఇంటర్వ్యూ అతను

ఈ సారి గాంధీ గారు కూడా,ఏ మాత్రం సిగ్గు పడకుండా , “గ్రీన్ రెవల్యూషన్ మళ్ళి తీస్కోస్తానని , టెలివిజన్ రెవల్యూషన్ తీస్కోస్తానని , లంచాన్ని ఒంటి చేత్తో అరికట్టేస్తానని” గుక్క తిప్పుకోకుండా చెప్పేసాడు.

నువ్వు మొండి అయితే నేను జగ మొండి అనే టైపు లో ఇంటర్వ్యూ అతను మళ్ళి చివరిగా నాలుగోస్సారి  ఇటు అటూ మడతేసి మళ్ళి అదే ప్రశ్న ని మన పప్పు  బాబు గారికి వేసారు

నేను మొనార్కు ని అనే టైపు లో మన కాంగ్రెస్ అధిపతి గారు మళ్ళి “స్త్రీ లని ఉన్నత పదవుల్లోకి తీసుకెళ్తామని , డెమోక్రసీ గురించి, దేశ యువత గురించి, లంచగొండి తనం గురించి, వ్యవస్థపై  యుద్దం గురించి చెప్పాడు”.

ఇక ఇంటర్వ్యూ చేసే అయన కి విసుగొచ్చి వేరే ప్రశ్న వేసాడు.

ఇలా సా….గిందండి మన రాహుల్ బాబా ఇంటర్వ్యూ.తరువాత అయన వేసిన ప్రశ్నలు అన్నిటికీ పైన చెప్పిన సమాధానాలే మళ్ళి, మళ్ళి మళ్ళి, ఏ మాత్రం సిగ్గులేకుండా, చెప్పాడనమాట.

35076735నాకైతే ఆ ఇంటర్వ్యూ చేసిన అతని ఓపికకి సాష్టాంగనమస్కారం చెయ్యాలనిపించింది.అయన పాపం ఎంతో కష్టపడి హోంవర్క్ చేసి తయారు చేస్కున్న ఇంటర్వ్యూ మాటర్ అంతా బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది.ఇంటర్వ్యూ జరిగేటప్పుడు చాలా ఓపిక పట్టినట్టు, నవ్వు ఆపుకున్నట్టు మనకి కనిపిస్తుంది.

ఏమాట కి ఆ మాట చెప్పుకోవాలి…ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు అర్నవ్  గోస్వామి,చాలా చక్కగా మంచి  పదునైన బాణం లాంటి ప్రశ్నలు తయారు చేసాడు.ఆయన వైపు నుండి అసలు  ఏ లోపం లేదు.దేశం లో అప్పుడు, ఇప్పుడు వున్న సమస్యలన్నిటిని బయటికి తీసాడు. ఇందిరా గాంధీహత్యా, రాజీవ్ గాంధీ బలవంతపు రాజకీయ ప్రవేశం, కాంగ్రెస్ పార్టీ లో పాతుకుపోయిన లంచగొండి తనం,పక్షపాత బుద్ధి, 1984 డిల్లీ అల్లర్లు, 2 జి కుంభకోణం ,విదేశీ పెట్టుబడులు, ఆర్ధిక మాంద్యం,DMK,AAP పార్టీకి కాంగ్రెస్ మద్దతు తెలపడానికి కారణం….ఇలా చాలా సున్నితమైన విషయాల గురించి చక్కని ప్రశ్నలను సంధించారు అర్నవ్ గోస్వామి…

“వీటికి గనుక రాహుల్ చక్కని సమాధానాలు చెప్పి వుంటే …ఈ ఇంటర్వ్యూ రాజకీయంగా అతనికి ఎంతో మేలు చేసేది.కాని తన అసమర్ధతతో తన వేలితో తన కన్నే పొడుచుకున్నాడు.”

మన దేశ యువ జన నాయకుడి ని చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు…నాకైతే నా కాలేజి రోజుల్లో వైవా గుర్తోచించి.కానీ ఒక శక్తివంతమైన పార్టీ నాయకుడు అంత మూర్ఖంగా, అనాలోచితంగా, బాధ్యతారాహిత్యంగా సమాధానం చెప్పడం ఏమీ బావోలేదు. పైగా నేడు సాంకేతికంగా దేశం ఎంతో ముందు ఉంది, ప్రజలను అంత తేలిగ్గా ఎవరూ నమ్మించలేరు.ఇంటర్వ్యూ చూసిన ప్రతి పౌరుడూ ఇతనా దేశాన్ని నడిపించబోయే నాయకుడు అని ఆశ్చర్యపడి ఆ తరువాత భాద పడక మానడు.

Sonia-Gandhi-Rahul-Gandhi-accused-in-Land-Acquisition-Scam-in-Gurgaon-Ullawas-village-Haryanaఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్ కూడా చక్కగా చెప్పగలిగే ప్రశ్నలకి, ఒక m.phil చేసి,  43ఏళ్ల రాజకీయ సంబంధం ,10 ఏళ్ల రాజకీయ అనుభవం, పేరుకి వెనుక గాంధీ అనబడే గౌరవం కలిగిన ఒక వ్యక్తిఎందుకు చెప్పలేకపోయాడు?????

ఏమైతేనేమి కాంగ్రెస్ కి కోలుకోలేని దెబ్బ కొట్టాడు రాహుల్ బాబా.కొండ నాలుక కి మందు వేస్తే వున్న నాలుక ఊడిందిట అలాగైంది కాంగ్రెస్ పని.అటు ప్రతిపక్షంలో వున్న మోడీ తన వాక్చాతుర్యం తో ప్రజల్నిఆకట్టుకుంటుంటే ఇక్కడ రాహుల్  కి కనీసం తన సొంత భావాలను వ్యక్తం చేసే దైర్యం కూడా లేనట్టు కనిపిస్తోంది.చాలా సులువైన ప్రశ్నలకు కూడా అతను ఎందుకు అంత తత్తరపడ్డాడో అర్ధం కాలేదు.

కొసమెరుపు: అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే “నేను ఎన్నో గొప్ప విషయాల గురించి చర్చిద్దామని వచ్చాను….కానీ మీరు అవేమీ నన్ను అడగడం లేదు “అని రాహుల్  బాధపడ్డాడు….

అయ్యో రాహుల్ బాబు, నీకు నచ్చిన , నువ్వు నేర్చుకుని వచ్చిన ప్రశ్నలు అడిగితే  అది ఉపన్యాసం అవుతుంది కాని ఇంటర్వ్యూ ఎలా అవుతుందయ్యా బాబూ…..

మొత్తానికి గుర్రాన్ని బలవంతంగా చెరువు దగ్గరికి తీస్కురావడమే కాకుండా నీళ్లు కూడా తాగించేటట్లు ఉన్నారు సదరు హై కమాండు వారు…

rahul_gandhi_5కానీ తన శక్తికి మించిన బరువు భాద్యతలని ఈరాకుమారుడు ఎలా మోస్తాడో మరి  చూడాలి …..ఎంతైనా భారత ప్రజానీకానికి  ఓపిక ఎక్కువే కదా….

అనుకున్నదొక్కటి ఐనదోక్కటి బోల్తా కొట్టిందిలే కాంగ్రెస్ పిట్టా….

నేడే చూడండి….

07slide11నేడే చూడండి బాబూ….ఈ ఒక్క మాట చాలు సినిమా బండి లో….అప్పట్లో ఒక సినిమా ప్రజల్లో కి దూసుకెల్లడానికి..ఒక వస్తువు తయారుచెయ్యడం,కనుక్కోవడం గొప్పకాదు..దాన్నిజనాల్లోకి తీసుకెళ్లడం గొప్ప…అదే పబ్లిసిటీ …ఇప్పుడైతే మనకి ప్రపంచం మన చూపుడు వేలు కిందకి వచేసిన్దనుకోండి(అదేనండి టచ్ స్క్రీన్ సిస్టంకదా)…కానీ ఇవన్నీ లేకముందు ఎలా చేసేవారు …ముందైతే మనుషుల్ని పెట్టి చెప్పించేవారు…తరవాత పేపర్ లో ప్రకటనలు…తరవాత రేడియో విప్లవం….తరవాత టీవీ ల విజ్రుంభన..తర్వాత ఇంటర్నెట్ ప్రభంజనం… ఈ మెయిలు…ఫేసుబుక్కు, ట్విటర్…ఇలా ఇప్పటి వాళ్ళకైతే ఎన్నో సాధనాలు..ఒక విషయం చెప్పాలి, అని పక్కింటికి వెళ్ళేలోపు…సప్తసముద్రాల అవతల అమెరికాలో వున్న వాళ్ళకి కూడా వార్త  వెళ్ళిపోతుంది…అవునా?

ఒక్క సారి ఈ ప్రకటనల చరిత్ర కొంచెం చూద్దామా….అసలు ఇవి ఎందుకు గుర్తోచాయంటే మొన్నామధ్య పాత చందమామ పుస్తకం చదువుతుంటే దాంట్లో ఒక ప్రకటన చూసాను భలే త్రిలింగ్ గా అనిపించింది…లక్స్ యాడ్ అది..దాంట్లో గోప్పెంటి? అనుకుంటున్నారా…ఇప్పటి లక్స్ తారలు కాదు , అందులో వున్న స్టార్ ఎవరో తెలుసా?…. అమావాస్య ఎరుగని చందమామ లాగా అందంగా నవ్వే మన సావిత్రి గారు…తర్వాత కొన్ని వివరాలు గూగుల్ మాత ని అడిగితే తెలిసింది లక్స్ సబ్బు వంశపారపర్యం గా ఎప్పటినుంచో సినీ స్టార్స్ ని తమ ప్రకటనలకి పెట్టుకునేదిట…

cFyScటాలివుడ్,బాలివుడ్..ఏ వుడ్లో  వుండే స్టార్ ఐనా లక్స్ యాడ్ లో నటించడం ఒక ప్రెస్టేజ్ లాగా చెప్పుకునేవారట…అంటే  నా సౌందర్య రహస్యం లక్స్ అని కైపు గా మనకి కత్రినా చెప్పినట్టు..మన అమ్మమ్మ కి సావిత్రి….పెద్దమ్మకి జయప్రదా….అమ్మకి శ్రీ దేవి….అక్కకి మాధురి దీక్షిత్ చెప్పారన్నమాట….తమాషాగావుంది కదూ..మన పిల్లలకి …మనవరాళ్ళకి కి కూడా ,అందరికీ తెలిసిన ఈ రహస్యం చెప్పడానికి ఇంకో తరం వారు రెడీగా ఉన్నారేమో…భూమి గుండ్రంగా ఉంటుందంటే ఇదే కాబోలు….

 

old-lux-ad-posters-10old-lux-ad-posters-11

అప్పటి సినిమా పోస్టర్లు…బిస్కెట్లూ చాక్లెట్లు…మందులూ ఇలా చాలా ప్రకటనలు ఉన్నాయ్….తమాషాగా ఉన్నాయ్ అవన్నీ…నేడే చూడండి…తప్పకవాడండి…మీ ఆరోగ్య రహస్యం…ఇలా చక్కటి తెలుగు తో ప్రతి వాళ్ళకి అర్ధం అయ్యేలా భలే ఉన్నాయ్…       196465,xcitefun-india-old-ads-1Dreamflower_Pond's _old_ad

indexఅన్నిటి కన్నానాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే మిస్సమ్మ సినిమా పోస్టరు…దాంట్లో ఎం రాసుందో తెలుసా “తప్పక చూడండి మీ అభిమాన నటులు నటించిన గోప్ప శృంగార చిత్రం “ అని…మిస్సమ్మ లాంటి క్లాసిక్ పిక్చరుని శృంగార చిత్రం అంటే, ఇహ ఇప్పటి సినిమాలని ఏమంటారో??

ఎంతైనా పాత పడే కొద్దీ కొన్ని విషయాలు భలే బాగుంటాయ్..పాత పుస్తకంలో దొరికినన రూపాయ్ నోటు లాగా…బామ్మ ట్రంకు పెట్టె లో దొరికిన కంచి పట్టు చీర లాగా…కొన్ని పాత విషయాలు మనల్ని ఉన్నపళాన టైం మిషన్ ఎక్కించి ఎక్కడికో తీస్కేల్లిపోతుంటాయ్..

gemsbond2Telugu_film_poster_C.I.D.

పేపర్ ల వరకు అంటే నాకది చరిత్ర ,అంటే గతం …ఎందుకంటే నేను టీవీ యుగం కి చెందినదాన్నిఅనమాట….అప్పుడప్పుడూ నాకు వింత ఆలోచనలు వస్తుంటాయ్….త్రేతాయుగం, ద్వాపరయుగం లాగా…ముందుముందు పేపర్ యుగం…టీవీ యుగం…ఈమెయిల్ యుగం…ఫేస్బుక్ యుగం వస్తాయేమో అని…..చెప్పలేం.

Doordarshanఇహ పోతే నా యుగం గురించి చెప్పాలంటే మాకదో అద్భుతాల పెట్టి.అందులో వచ్చే ప్రకటనలు ఒక విప్లవం సృష్టించయనే చెప్పొచు. బెస్ట్ ఎగ్జాంపుల్ మన నిర్మా యాడు…వాషింగ్ పవ్దర్ నిర్మా…పాట రాని వాళ్ళు ఉంటారా మీరె చెప్పండి…నాకింకా గుర్తు, బాగా నురుగ వచ్చేలా చేసి నేను ఆ పాటపాడితే, చివరగా మా అమ్మ ఆ నురగ ని నా ముక్కుకి రాయాలనమాట..అదో ఆట నాకు..nirma-girl

ఆదివారం అయితే చక్కగా ఈ య్యాడ్ల పాటలతో నే అంతాక్షరి అని ఇంకా సంతూర్ ఆట అని ఎన్నో ఆటలు ఆడేవాళ్ళం….ఐ లవ్యూ రస్నా అని రస్నాతాగాక అనడం…ఏమైంది? అంటే పాప ఏడ్చింది అని అనడం …హార్లిక్స్ ని కావాలని తినేసి నేను హార్లిక్స్ తాగను, తింటాను అనడం…తలచుకుంటే భలే నవ్వొస్తుంది….1047400011_1bc118ad0b

దూరదర్శన్లో శుక్రవారం వచ్చే చిత్రలహరి కోసం హోం వర్కు త్వరగా చేసెయ్యడం …ఆదివారం సాయంత్రం  4గంటలకి వచ్చేసినిమా గురించి పొద్దున్నించి ఎదురు చూడడం …అన్నయ్యకి ప్యాంటు మీద చెడ్డి వేసి టవల్ మెడకి చుట్టి శక్తిమాన్ చెయ్యడం…..అన్నీ స్వీట్ మెమోరీస్….అమాయకమైన రోజులు.

పల్లెల్లో అయితే ఆదివారం టీవీ ఉన్నవాళ్ళ ఇల్లు మినీ ధియేటర్ అయిపోయేది.

lifebuoy -oldcadbury_52

మొత్తానికి టీవీ, టీవీ లో వచ్చేయాడ్లు కూడా  1980-90s  పిల్లలపై చాలా ప్రభావమే చుపించాయ్ అని చెప్పొచు.

ఇప్పటి జనరేషన్ ఫాస్ట్ అని పేరెంట్స్ అంటుంటారు కానీ…ఒకోసారి వీళ్ళు అమాయకత్వం లో వుండే సంతోషాలని, ఆనందాలని మర్చిపోతున్నారేమో అనిపిస్తుంది….బహుశా ఏది వెతక్కుండా, కష్టపడకుండా అన్ని చేతికి అందడం వల్లేమో…

ఏమో ఏమి చెప్పలేం..ఎందుకంటే ఈ జెనరేషన్ వాళ్ళు వాళ్ళ జూనియర్సుని చూసి మనలాగే అనుకుంటారేమో…చెప్పాను కదా భూమి గుండ్రంగా ఉంటుందని.

మీ చిన్ననాటి సంగతులు మీచిన్నారులతో పంచుకోండి…ఒకసారి మీ పాతరోజులు మీకు గుర్తొస్తాయి..వాళ్ళకి కూడా కాస్త కాలాన్ని విశ్లేషణ చెయ్యడం వస్తుంది…